Manchu Vishnu: గత మూడు రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ సినిమా వివాదమే అని చెప్పాలి. మొదటిసారి అర్జున్ సొంత నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తన కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. యంగ్ హీరో విశ్వక్ హీరోగా తన కుమార్తెను హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అర్జున్ ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేశారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న సమయంలో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ లు పెట్టడం అర్జున్ వ్యాఖ్యలకు విశ్వక్ స్పందిస్తూ తన రీజన్స్ తాను వెల్లడించారు.ఇకపోతే ఈ విషయంపై అర్జున్ చాలా సీరియస్ అవ్వడమే కాకుండా తన సినిమా నుంచి తప్పుకోవడం అంటే తన గౌరవాన్ని కించపరిచినట్లనీ భావించినటువంటి ఈయన నటుడు విశ్వక్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం ఈ విషయంపై స్పందిస్తూ నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీలాంటి ఒక సీనియర్ హీరోని ఇబ్బంది పెట్టినటువంటి ఆ యంగ్ హీరోను అసలు వదిలిపెట్టనని మంచు విష్ణు చెప్పినట్టు సమాచారం. అసలు సమస్య ఏంటి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మంచు విష్ణు తెలుసుకున్నారు.
ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి చెప్పినటువంటి రీజన్స్ సరైనవా లేదా అని తెలుసుకొని ఆయన హీరో విశ్వక్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితులలోనూ అర్జున్ సినిమాని ఆపకుండా ముందుకు తీసుకు వెళ్లడానికి మా అధ్యక్షుడు భరోసా కల్పించారని సమాచారం.ఇలా మంచు విష్ణు నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…