Mugguru Kodukulu : కృష్ణ 1942 లోగుంటూరు జిల్లా, తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరు ఆదిశేషగిరిరావు మరొకరు హనుమంతరావు.
కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు చిత్రం కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తన ఫోటోలు పంపించాడు. అలా చిత్రానికి హీరో గా ఎంపికయ్యారు. ఆ తర్వాత గూడచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడులాంటి మనిషి, బుర్రిపాలెం బుల్లోడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, సింహాసనం లాంటి చిత్రాల్లో కృష్ణ విజయ దుందుభి మోగించారు.
ఆయన తల్లి గారైన నాగరత్నమ్మ తనకు కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ముగ్గురు కొడుకులు కావడంతో.. వారి గుర్తుగా “ముగ్గురు కొడుకులు” చిత్రాన్ని ఆమె రిజిస్టర్ చేయించడం జరిగింది. కథ కోసం పద్మాలయ బ్యానర్ ఆస్థాన రచయిత మహారధిని ఒక కథ తయారు చేయమన్నారు. అలా ఏడాది గడిచినా కూడా మహారధి కథ తయారు చేయలేకపోయారు. నాగరత్నమ్మ ఆ విషయాన్ని పెద్ద కుమారుడైన కృష్ణకి చెప్పారు.
ముగ్గురు కొడుకులు టైటిల్ కి తగిన కథ పరుచూరి బ్రదర్స్ చే రాయిస్తానని తన మాతృమూర్తికి హామీ ఇవ్వడం జరిగింది. అలా పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి రిజిస్టర్ చేసిన “ముగ్గురుకొడుకులు” చిత్రానికి తగిన విధంగా ఒక కథ తయారు చేయాలని పరుచూరి బ్రదర్స్ కు చెప్పారు. అలా కొన్ని రోజులకి పరుచూరి బ్రదర్స్ హీరో కృష్ణకి ఓ కథ చెప్పారు. ఎందుకనో ఆ కథ కృష్ణ కి నచ్చలేదు. తర్వాత దర్శకుడు పి.సి.రెడ్డి చెప్పిన లైన్ కృష్ణకు నచ్చడంతో ఊటీ బ్యాక్ డ్రాప్ లో కథ సిద్ధం చేశారు.
ఈ సినిమాకి సంభాషణలు రాసే బాధ్యత పరుచూరిబ్రదర్స్ తీసుకున్నారు. స్కూల్ సెలవులలోనే మహేష్ బాబుతో సినిమా షూటింగ్ జరిపేవారు. ఈ సినిమాలో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా గుమ్మడి, అన్నపూర్ణలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కృష్ణ సరసన గ్లామర్ క్వీన్ రాధ, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనమ్ నటించారు. మహేష్ బాబు ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తాడు. ఆ చిన్న వయసులో పాత్రకు తగిన విధంగా హావభావాలు అద్భుతమైన డైలాగులు మహేష్ బాబు చెప్పడంతో సినిమా యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారు.
పద్మాలయ బ్యానర్ పై కృష్ణ మాతృమూర్తి ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మాణం, కృష్ణ స్వీయ దర్శకత్వంలో 1988, అక్టోబర్ 20 న “ముగ్గురు కొడుకులు” చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించినందుకు తల్లి నాగరత్నమ్మ చాలా సంతోషించారు. కానీ ఈ సినిమా శతదినోత్సవ సమయానికి ఆమె కన్నుమూశారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.