Naatu Naatu Song:తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విజయం పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకుంది అయితే ఈ వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య ఇక్కడ కనిపించకపోవడంతో అసలు దానయ్య రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీశారు.ఇలా ఏ ఒక్క వేడుకలో కూడా దానయ్య కనిపించకపోవడంతో అసలు ఏం జరిగింది అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ విషయంపై నిర్మాత దానయ్య స్పందించారు. ఇలా తను నిర్మించిన ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఈయన తెలిపారు. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేననీ ఈ సందర్భంగా దానయ్య వెల్లడించారు.
తన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం సినిమా విడుదల తర్వాత వీరితో కాంటాక్ట్ లేను అని చెప్పడంతో అసలు ఎందుకు లేరనే విషయం చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లకు దానయ్య అడిగిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…