నాగ్ అశ్విన్ తదుపరి చిత్రంలో దీపికా పదుకొణె , బాహుబలి స్టార్ ప్రభాస్ మొదటిసారి స్క్రీన్స్పేస్ను పంచుకోనున్నారు. దీనికి తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ కె’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు హైదరాబాద్లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూట్ను ప్రారంభించారు.
దీపికా పదుకొణె గతవారం టీమ్లో జాయిన్ అవ్వగా.. ప్రభాస్ ఈరోజు నుంచి షూటింగ్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను రూపొందించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను గ్రాండ్గా మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు ఈ మెగా ప్రాజెక్ట్ను ప్రకటించిన సందర్భంగా.. నాగ్ అశ్విన్ ఒక ప్రకటనలో ఈ చిత్రం కథ గురించి తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పాడు. దీపిక ఈ పాత్రలో నటించినందుకు తాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత వరకు దీపిక ఇటువంటి రోల్ చేయలేదని తెలిపారు.
దీపిక, ప్రభాస్ల జోడి ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అన్నారు. దీనిలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. కొన్ని నెలల క్రితం ఆరంభమైన ఈ చిత్రం షూటింగ్లో అమితాబ్ బచ్చన్ మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునేతో పాటు.. తాజాగా ప్రభాస్ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా, డాని శాంచెజ్ లోపెజ్ కెమెరా బాధ్యతలను అప్పగించారు.
ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…
బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్పై జైలు నుంచి…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…
ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…