Nagarjuna -Amala: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమల, నాగార్జున ఇద్దరు కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన నాగార్జున, అమల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ… ఏడాది తర్వాత సతీసమేతంగా ఇలా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా నాగార్జున తన కొడుకులు అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య గురించి కూడా మాట్లాడుతూ..త్వరలోనే మా అబ్బాయిలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాము అని నాగార్జున తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అలాగే మరొకవైపు అక్కినేని నాగచైతన్య కూడా ‘ కస్టడీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
గతంలో విడుదలైన థాంక్యూ సినిమా నాగచైతన్యకు నిరాశ మిగిల్చింది. దీంతో ప్రస్తుతం కస్టడీ సినిమా మీద నాగచైతన్య ఆశలు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కూడా తాను నటించిన ఏజెంట్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ‘ ది ఘోస్ట్ ‘ సినిమా ద్వారా నాగార్జునకి కూడా పరాజయం ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని సమాచారం.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…