Nagarjuna – Amala: బాలీవుడ్ తారలతో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్న నాగార్జున దంపతులు.. ఫోటోలు వైరల్!

Nagarjuna – Amala:ఈ ఏడాది దసరా పండుగను సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా దసరా పండుగ సందర్భంగా తెలుగులో కూడా సినిమాలు విడుదలవడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకున్నారు. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలయి మంచి హిట్ కావడంతో నాగార్జున కుటుంబ సభ్యులు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దసరా పండుగ సందర్భంగా నాగార్జున దంపతులు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నాగార్జున బాలీవుడ్ తారలతో కలిసి దసరా వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ కు కేవలం తెలుగులో మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక ఈ బ్రాండ్ కు వివిధ భాషలలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సెలెబ్రెటీల అందరిని ఒకే చోట చేర్చి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Nagarjuna – Amala: అందరినీ ఒకచోట చేర్చిన కళ్యాణ్ జువెలర్స్..

ఈ క్రమంలోనే నాగార్జున అమలతో పాటు రణబీర్ కపూర్, స్నేహ, కత్రినా కైఫ్,కళ్యాణి ప్రియదర్శన్ వంటి పలువురు సెలబ్రిటీలు ఒకే చోటచేరి దసరా వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అఖిల్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.