Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?
Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను మించి బంగార్రాజు చిత్రం ఉండబోతోందని తెలిపారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారు.అసలు నాగార్జున అభిమానులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే…
జనవరి 14వ తేదీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ వేడుకను ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకకు అభిమానులను ఎవరిని పిలవడం లేదని అందుకు ప్రతి ఒక్క అభిమానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు నాగార్జున ఈ వేదికపై తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…