Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?
Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను మించి బంగార్రాజు చిత్రం ఉండబోతోందని తెలిపారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారు.అసలు నాగార్జున అభిమానులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే…
జనవరి 14వ తేదీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ వేడుకను ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకకు అభిమానులను ఎవరిని పిలవడం లేదని అందుకు ప్రతి ఒక్క అభిమానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు నాగార్జున ఈ వేదికపై తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…