Nagarjuna: బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై విమర్శలు వెల్లువెత్తుతాయి. గతంలో కూడా ఈ కార్యక్రమం పై ఎంతోమంది విమర్శలు చేయగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే సీపీఐనారాయణ గత సీజన్లో కూడా బిగ్ బాస్ కార్యక్రమం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని ముంబైలో రెడ్ లైట్ ఏరియాతో పోల్చారు.ఇలా ఈ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ ఈసారి సీజన్ కూడా ప్రసారం అవడంతో మరోసారి నాగార్జున పై మండి పడ్డారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పట్ల పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా నాగార్జున వెనకాడరు అంటూ కామెంట్ చేశారు.ఇప్పుడు కూడా ఇలాంటి విమర్శలను పట్టించుకోని నాగార్జున ఈసారి నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.గత ఆదివారం బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి మెరీనా రోహిత్ దంపతులను కౌగిలించుకోమని చెప్పారు.
నాగార్జున ఇలా చెప్పేసరికి కాస్త వెనకాడిన ఈ జంటకు నాగార్జున భరోసా ఇస్తూ మీకు లైసెన్స్ ఉంది కౌగిలించుకోండి అంటూ చెబుతూ నారాయణ.. నారాయణ అంటూ వేదికపై నారాయణ పేరు పలికారు. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి అయిన జంట అని కౌగిలించుకోవడంలో తప్పులేదు మరోసారి ఈ సంఘటనపై కామెంట్లు చేయాల్సిన పని లేదంటూ ఈ సందర్భంగా నాగార్జున నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పరోక్షంగా అతని పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…