Bigg Boss: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ పై స్పందించిన నాగార్జున..! క్లారిటీ ఇచ్చేశాడుగా..!
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ఇప్పుడందరిలో సీజన్ 6పై చర్చ ప్రారంభమైంది. అయితే వచ్చే సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుందా.. లేకపోతే స్టార్ మాలోనే ప్రసారం అవుతుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పాటు సీజన్ 6కు హెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారనే వాదన కూడా నడుస్తోంది. ఇప్పటికే ఆహాలో ’’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘‘ టాక్ షోలో హోస్ట్ గా దుమ్ము రేపుతున్నారు బాలయ్య.
అయితే వీటన్నింటికి సమాధానాలు ఇచ్చారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ 5 ముగియడంతో మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 6 కూడా ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్లు ఎవరో అని తెలియదు. శుక్రవారం ’పరంపర‘ వెబ్ సిరీస్ విడుదల అవుతున్న సందర్భంలో హాట్ స్టార్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
అయితే టీవీలో వచ్చే బిగ్ బాస్ కు ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ కు తేడా ఉంటుందని ఆయన అన్నారు. దీనిని కొత్తగా ప్రోగ్రామింగ్ చేస్తున్నామని.. ఇందులో ఉండే సెలబ్రెటీలు ఎవరో తెలియదని నాగార్జున అన్నారు. ఓ పక్క సినిమాలు.. మరో పక్క బిగ్ బాస్ షో ఒత్తడి అనిపించదా.. అనే ప్రశ్నకు సమాధానంగా .. నాకు ఒత్తడి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా వర్క్ చేస్తానని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నాకు ఫ్యామిలీగా అనిపిస్తుందని కామెంట్ చేశారు.
బిగ్ బాస్ ను ప్రేక్షకులే కాదు..నేను మిస్ అవుతున్నానని చెప్పారు. మీరు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ కు తేడా లేమిటి అని అడగ్గా.. మీలో ఎవరు కోటీశ్వరుడు నాలెడ్జ్ షో అని… బిగ్ బాస్ దీనికి పూర్తిగా విభిన్నంగా ఉంటుందని.. ఇక్కడ వ్యక్తులపై నాలెడ్జ్ వస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్నకు కూడా నాగార్జున సమాధానం ఇచ్చారు.
బిగ్ బాస్ 6 లో మీరు హోస్ట్ గా వ్యవహరించరని వార్తలు వస్తున్నాయి… వేరే వాళ్లు హోస్ట్ గా చేస్తున్నట్లు తెలిసింది అన్న ప్రశ్నకు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వచ్చే బిగ్ బాస్ 6 సీజన్ కు కూడా నేనే హోస్ట్ గా ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారనే పుకార్లకు తెర పడినట్లు అయింది.
ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ 6.. హాట్ స్టార్ లో వేరేలా.. స్టార్ మాలో వేరేలా ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…