Nagineedu : ప్రసాద్ ల్యాబ్ లో జనరల్ మేనేజర్ గా పని చేసిన నాగినీడు గారు ఆ తరువాత బెల్లం కొండ సురేష్ గారి సలహాతో సినిమాలోకి వచ్చారు. మొదట వి వి వినాయక్ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలో మంత్రి పాత్రలో కనిపించిన నాగినీడు గారు ఆ తరువాత రాజమౌళి గారి ‘మర్యాద రామన్న’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు తమిళ భాషలో కూడా మంచి సినిమాలలో నటించిన నాగినీడు గారు క్రితం ‘మా అసోసియేషన్’ ఎన్నికల్లో సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. మా బిల్డింగ్ తదితర హామీల గురించి విష్ణు అధ్యక్షుడు అయ్యాక చేస్తున్న పనుల గురించి తన అభిప్రాయలను తెలిపారు.

ఓట్లు ఎందుకు అడుక్కోవాలి…
ప్రకాష్ రాజ్, విష్ణు పోటా పోటీ గా జరిగిన మా ఎలక్షన్ లో మంచు విష్ణు అతని ప్యానెల్ గెలిచారు. సార్వత్రిక ఎన్నికల తరహాలో హామీలు ప్రచారాలు అంటూ హోరెత్తించారు. ముఖ్యంగా మంచు విష్ణు గెలవడానికి కారణం ఆయన మా అసోసియేషన్ కి బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇవ్వడం. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్నుం డి పోటీ చేసిన నాగినీడు ఆయన ఓడిపోడానికి గల కారణాలను వివరించారు. ఎలక్షన్ మొదలయ్యాక విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నా కానీ కొనసాగించాల్సి వచ్చింది.

ప్రకాష్ రాజ్ గారు నటుడుగా బాగా ఇష్టం కానీ వ్యవహారికంగా బేదాభిప్రాయాలు వచ్చాయి. ఎలక్షన్ నుండి తప్పుకుందామని అనుకుంటే కుదరలేదు. పైగా నాకు ఓట్లు అడగడం అనే పద్దతి నచ్చలేదు. మన గురించి ఒక అవగాహన, ఎంత సోషల్ సర్వీస్ చేయగలం అని తెలిస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు నచ్చక పోతే ఓట్లు వేయరు అడగాల్సిన పని లేదు అని నా అభిప్రాయం అంతే, అందుకే ఓట్లు అడగలేదు. ఇక ఓడిపోయినా పెద్ధగా ఏం అనిపించలేదు అంటూ చెప్పారు. విష్ణు హామీల గురించి మాట్లాడుతూ అది గెలిపించుకున్నవాళ్లు ఓట్లు వేసినవాళ్లు అడగాలి నేనెందుకు అడగాలి, హామీలు ఏమయ్యాయి అని ఓట్లు వేసినవాళ్లు సైలెంట్ గా ఉన్నపుడు వేరేవాళ్ళకెందుకు అంటూ అభిప్రాయపడ్డారు.

































