Nandamuri Balakrishna : ఇటీవల జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జరిగిన సంఘటనల గురించి తెలిసిందే. ఈ సంఘటనపై నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సిగ్గులేని బతుకులు అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు, అది ఒక సంస్కృతి, నాగరికత ఎన్టీఆర్ తెలుగుజాతి వెన్నుముక అని ఆయన భావొద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. శునకాలముందు తలవంచకు తిరిగే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణపై హిజ్రాల ఫిర్యాదు…
యూనివర్సిటీ పేరు విషయంలో వైస్సార్సీపీ పై విరుచుకుపడిన బాలకృష్ణ మీద వైస్సార్సీపీ నాయకులు, మంత్రులు కూడా చురకలు అంటించారు. ఇది ఇలా ఉండగా తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై పోలీస్ స్టేషన్లో హిజ్రాలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మా సమస్యలు చెప్పుకోవాలి అంటే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడంలేదని అని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

హిందూపూర్ లో ఎమ్మెల్యే గా విధులు నిర్వహించాల్సిన బాలయ్య ఇక్కడ ఉండటం లేదని వెంటనే ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ కు చెందిన వర్గం నేతలు జగన్ దృష్టిలో పడాలన్న తాపత్రయంతో బాలకృష్ణ పై కావాలని హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని టిడిపి నేతలు మండి పడుతున్నారు. బాలకృష్ణ నియోజక వర్గంలో ఉన్నా లేకపోయినా అక్కడి అభివృద్ధి, సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అని తెలియజేసారు.

































