Nandamuri Balakrishna : అల్లు అరవింద్ మొదలు పెట్టిన తెలుగు ఓటీటీ ఆహా ఎంతటి ఘన విజయం సాదిస్తోందో తెలిసిందే. అయితే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ ది ప్రత్యేకస్థానం అనే చెప్పుకోవాలి. బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కారణంగానే ఆహాకు సబ్ స్క్రైబర్ లు పెరిగారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆతరువాత వచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగెర్స్ ప్రోగ్రాం కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా థమన్, నిత్యమీనన్, సింగర్ కార్తిక్ లు జడ్జిలుగా వ్యవహారిస్తున్నారు. ఈ ప్రోగ్రాం టాప్ 6 కంటెస్టెంట్ కు సంబందించిన ప్రోమో ఒక్కటి నెట్ లో హల్చల్ చేస్తోంది.

భార్యని ఏమార్చడం ఎలా…..
తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 కంటెస్టెంట్ ప్రోగ్రాంకు బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే బాలయ్య చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. అఖండ సినిమాలో పాట పాడిన సింగర్ ను అభినందిస్తూ…. పెళ్లి చేసుకోబోతున్నావ్ అంట కదా… పెళ్లి ఎపుడు అని అడగను, పెళ్లి ఎందుకు అని అంటాను అని అక్కడితో ఆగకుండా ‘భార్యను ఏమార్చడం ఎలా’ రిటన్ బై ఎన్ బి కే అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ వసుంధర చూడకూడదు, చూస్తే మాత్రం దబిడే దిబిడే అని నవ్వులు పూయించారు.

ఇక మరో సింగర్ ని చూసి అందరు కొత్త కంటెస్టెంట్ లు అని చెప్పారు, మరి పూజ హెగ్డేని పిలిచారు ఏంటయ్యా అని ప్రోగ్రాం లో జోష్ పెంచారు. ఇక సింగర్ తో కలసి ఆదిత్య 369 లో “మేక కు తోక తోక కు మేక” అంటూ సందడి చేశారు. ఇలా ప్రోగ్రాం ని తన జోష్ తో వేరే లెవెల్ కి తీసుకు వెళ్లారు బాలయ్య. ఈ ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కానుంది.



























