Nara Lokesh: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పండుగ వస్తుందంటే పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ నువ్వా…నేనా అన్నట్టు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ నటించబోతున్న సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా సంక్రాంతి బరిలో విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టర్లను విడుదల చేస్తూ పోటీపడుతున్నారు.
బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరి హీరోల పేరుతో టీడీపీ ఫర్ ఎవర్ అనే ట్విట్టర్ అకౌంట్ తో ఇద్దరు హీరోలని టార్గెట్ చేస్తూ, కులల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదంతా కూడా వైఎస్ఆర్సిపీ పని అంటూ ఈయన మండిపడటమే కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కులం మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఇలా ఫేక్ అకౌంట్స్ ఫేక్ ట్వీట్స్ నీకు సంతృప్తినిస్తాయేమో కానీ.. గెలుపును మాత్రం ఇవ్వవు జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…