Narasimha Raju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది.

కెనడా లో ఆస్తులు… సంవత్సరంలో కొన్నిరోజులు అక్కడే…
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు. ఆంధ్ర కమల్ హాసన్ గా బిరుదు తెచ్చుకున్న నరసింహ రాజు గారు సినిమాల్లో అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఇక పలు సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా పలు తమిళ సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇక నరసింహ రాజు గారికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కూతురు పలు కళాశాలలకు హెచ్ ఆర్ గా పనిచేస్తున్నారు. ఇక కొడుకు సినిమాల్లోకి రావాలని ఆశపడినా నరసింహ రాజు గారు వద్దని చెప్పడంతో చదువుకుని మోంట్రయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా లో పనిచేస్తున్నారు. ఇక కెనడాలో కొడుకు స్థిరపడటంతో అక్కడే ఆస్తులు కూడా చేసారు నరసింహ రాజు గారు. అక్కడ పది ఎకరాల గార్డెన్, రెండు పాలస్ లు ఉన్నాయి అంటూ చెప్పారు నరసింహరాజు గారు. ఇక ప్రతీ వేసవికి కెనడా వెళ్లి కొడుకుతో పాటే ఉండి ఎంజాయ్ చేసి వస్తారట నరసింహ రాజు గారి దంపతులు.






























