Naresh & Pavithra Lokesh : రోజుకో మలుపు తిరుగుతూ వైరల్ అవుతున్న నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి ఉదంతం ఇప్పుడు నాలుగుస్థంబాలాట గా మారింది. అటు పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచ్చేంద్ర ఆమె గురించి డబ్బు మనిషంటూ మాట్లాడారు. నాకంటే ముందు ఇంకొకరితో పెళ్లి జరిగిందని నాతో ఉన్నపుడు కూడా చాలా మందితో అఫైర్స్ ఉన్నాయని అన్నారు. ఇక ఇటు నరేష్ మూడో భార్య రమ్య కూడా నరేష్ మీద ఆరోపణలు చేసింది. నేనింకా విడిపోలేదంటూ మాట్లాడింది. ఇక ఈ విషయాలపై నట్టికుమార్ స్పందించారు.

సహజీవనం తప్పు కాదు…
ఇక సినిమా నిర్మాత నట్టి కుమార్ ఈ విషయంలో స్పందించారు. భార్యాభర్తల మధ్య డబ్బు, బ్లాక్మెయిలింగ్ విషయాలు రావడం ఏంటి, వ్యక్తిగతంగా సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను బయట ఎందుకు వివాదాలు చేసుకుంటున్నారో, ఇద్దరికి కలిసి ఉండటం ఇష్టం లేనపుడు విడిపోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు అంటూ మాట్లాడారు. ఇక పవిత్ర లోకేష్, నరేష్ ల రిలేషన్ గురించి మాట్లాడుతూ ఒక ఆడ, మగ స్నేహితులుగా ఉండటం తప్పు కాదు, దాన్ని తప్పుగా చూడకూడదు వాళ్ళు మేము స్నేహితులం అని చెప్తున్నారు.

ఇక సహజీవనం ఇప్పట్లో చాలా సాధారణ విషయం చాలా మంది అలా లివింగ్ టుగెథెర్ రిలేషన్ లో ఉంటున్నారు. సుప్రీం కోర్టె సహజీవనం తప్పు కాదని తీర్పు ఇచ్చింది. ఇక వీళ్ళ ఇష్యూ ని పర్సనల్ గా కూర్చొని సెటిల్ చేసుకోవాలి ఇలా మీడియా ముందు రావడం బాగోలేదు. ఎవరు ఈ విషయంలో కలుగజేసుకోకపోవడమే మంచిది. అది వాళ్ళ వ్యక్తిగత విషయం అని, నరేష్ మూడో భార్య రమ్య రఘువీరారెడ్డి గారి మేనకోడలు అలా నాకు తెలుసు, నరేష్ రమ్య ల మధ్య గొడవలేమైనా ఉంటే పెద్దమనుషులతో చర్చించి పరిష్కరించుకుంటే బాగుంటుంది అని చెప్పారు.





























