Natti Kumar : బ్రహ్మాస్త్ర సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయడానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేసుకుని హిందీ తో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 9 న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సౌత్ లో కూడా బాగా చేసారు. ఇక సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహారిస్తున్నాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను సౌత్ లో బాగా చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర సినిమా యూనిట్ కి తెలంగాణ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసుల బందోబస్తు ఇవ్వడం కష్టమని ఈవెంట్ ను రద్దు చేసుకోమని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో ఈవెంట్ రధ్ధయింది.
కెసిఆర్ ఎన్టీఆర్, రాజమౌళి ని టార్గెట్ చేశారా…
ఇక ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలాగ స్పందించారు. మీడియా మీట్ పెట్టి సినిమా యూనిట్ మాట్లాడింది. ఈ ఈవెంట్ కి అతిధి గా ఎన్టీఆర్ వస్తాడని ఆయన అభిమానులు ఈవెంట్ కి వచ్చేందుకు సిద్ధమైయ్యుంటారని ఎన్టీఆర్ ప్రత్యేక వీడియో అభిమానులకు క్షమాపణలు చెబుతూ విడుదల చేసారు. అయితే పొలిటికల్ హీట్ పెంచింది ఈ ఇష్యూ. రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ గారికి బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వడం, ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం వంటి అంశాలు ఇపుడు ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశం మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడుతూ రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు అని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడు, అయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రి మర్యాద పూర్వకంగా పిలిస్తే వెళ్లడం ఆయనకు ఇచ్చే గౌరవమే దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. ఇక రాజమౌళి బీజేపీ రంగు ఎప్పుడు పూసుకోలేదు. ఆయన తండ్రి సినిమాలకు సేవకు గుర్తింపు గా రాజ్యసభ సీటు వచ్చింది అంత మాత్రాన రాజకీయ రంగు పులమడం కరెక్ట్ కాదు అంటూ అయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పిన వీడియోలో కూడా సినిమాలకు సంబంధిచిన విషయాలను ప్రస్తావించారు కానీ రాజకీయాలకు సంబంధిచిన ఒక్క మాట మాట్లాడలేదు అంటూ చెప్పారు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…