Natti Kumar : సినిమా పరిశ్రమలో కొత్త కథలు రావాలి, డైరెక్టర్లు కాంబినేషన్స్ కోసం బిజినెస్ చేయకండి అన్న కోణంలో చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు మాట్లాడటంతో ఇపుడు ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అనే అనుమానం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇపుడు సంక్షోభంలో ఉంది అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలలో ఎవరి గురించి వీళ్లిద్దరూ కామెంట్స్ చేసారు అంటూ ఆలోచనలు విశ్లేషణలు బయలుదేరాయి. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పందించారు.
కొత్త కథలు రావాలి… పాన్ ఇండియా మోజులో పడి…
నట్టి కుమార్ చిరంజీవి, ఎన్టీఆర్ మాటల మీద స్పందిస్తూ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగుకోసమే చెప్పారు. కొత్త కథలు ఇండస్ట్రీకి రావాలి కానీ కాంబినేషన్ సెట్ చేసుకుని దానికి అనుగుణంగా కథ సిద్ధం చేసుకుని బిజినెస్ మీద ఫోకస్ చేయకండి అంటూ మాట్లాడారు. కథ, కథనం బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో అనే తేడాలేకుండా అందరూ సినిమాను ఆదరిస్తారు. బింబిసార, కార్తికేయ, సీతారామం వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం అంటూ చెప్పారు.
పాన్ ఇండియా మోజులో పడి పాన్ ఇండియా రేంజ్ కి కథ సిద్ధం చేసుకోవాలని అనుకుని ఏదో తీసేస్తే సినిమా ఎవరూ చూడరు అంటూ లైగర్ సినిమాను పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు నేటివిటీకి దూరంగా సినిమాలను తీస్తే ఎలా, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలను, కథనం పక్కాగా చేసుకుంటే అదే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ చెప్పారు. ఇద్దరు అగ్ర హీరోలు ఎవరిని ఉద్దేశించి అనలేదు, కేవలం ఇండస్ట్రీ బాగుకోసమే చెప్పారు అంటూ చెప్పారు నట్టి కుమార్.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…