వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బయట అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, నీరసం, అలసట వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా శరీరం నుంచి అధికంగా చెమట బయటకు వెళ్లినప్పుడు నీటితో పాటు కీలకమైన ఖనిజాలు కూడా తగ్గిపోతాయి. అలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడేందుకు సహజమైన పానీయాలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు. ఇవి శరీరంలో నీటి మోతాదును సమతుల్యంలో ఉంచడమే కాకుండా కండరాలు, నరాల పనితీరుకు కూడా సహాయపడతాయి. వేసవిలో అధికంగా చెమట పట్టినప్పుడు ఈ ఖనిజాలు తగ్గిపోతే బలహీనత, తల తిరగడం, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే కొన్ని పానీయాలు శరీరానికి ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా నిమ్మరసం, ఉప్పు, పంచదారతో తయారుచేసే సాంప్రదాయ డ్రింక్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన హోమ్ రెమిడీగా చెప్పొచ్చు. ఒక గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదార, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపితే సహజమైన ఓఆర్ఎస్ రెడీ అవుతుంది. ఇది శరీరంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయడంలో ఉపయోగపడుతుంది.
పంచదారను కేవలం రుచికోసం మాత్రమే వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అది శరీరంలో నీరు, సోడియం వంటి ఖనిజాలను వేగంగా శోషించుకునేందుకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ పానీయం వేసవిలో త్వరగా శక్తినిస్తుంది.
కొబ్బరి నీరు కూడా సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండటంతో శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. అలాగే మజ్జిగ, సబ్బక్క గంజి, పుదీనా-జీలకర్ర నీళ్లు వంటి సంప్రదాయ పానీయాలు కూడా వేసవిలో మంచి ఉపశమనం ఇస్తాయి.
అయితే బీపీ, షుగర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ను ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా రెడీమేడ్ డ్రింక్స్లో చక్కెర, సోడియం మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరం.
ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, సరైన పానీయాలను ఎంపిక చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కిచెన్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…