Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ లో ఉన్నారు. ఈ విధంగా ప్రేమ పక్షులుగా విహరించిన ఈ జంట ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

పెళ్లికి ముందు వివిధ క్షేత్రాలను సందర్శించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి అయిన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని ఈ కొత్త జంట దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే నయనతార శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవ సేవలో ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో నూతన జంటను ఆశీర్వదించారు.

ఇక శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నయనతార మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆలయ మాడ వీధులలో నయనతార చెప్పులు వేసుకుని తిరగడం పై పలువురు ఈమె వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. పవిత్రమైన మాడ వీధులలో నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల మాడ వీధులలో చెప్పులతో దర్శనం ఇచ్చిన నయనతార…
ఈ విధంగా నయనతార తిరుమల మాడవీధుల్లో కనిపించడంతో ఒక్కసారిగా మీడియా కూడా తనని చుట్టు ముట్టింది. అయితే కొందరు మీడియా ప్రతినిధులు కూడా చెప్పులు వేసుకుని మాడవీధుల్లో కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నటి నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్ర మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగటంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారింది. ఇలా పెళ్లయిన మరుసటిరోజే నయనతార నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారని చెప్పాలి.































