మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ చేయనున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమాలో చిరు నటించగా.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదు. కానీ తెలుగులో మాత్రం కథలో కొద్దిగా మార్పులు చేసి హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో రీమేక్ అవుతున్న లూసిఫర్ చిత్రంలో మెగాస్టార్ సరసన ఎవరు నటిస్తారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.ఈ క్రమంలోనే చిత్రబృందం లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం నయనతారను కలసి సంప్రదింపులు చేశారనే సమాచారం వినబడుతోంది.
లూసిఫర్ చిత్రంలో నయనతార పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈమె అధిక మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి లూసిఫర్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నటించాలంటే.. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే.. మరి చిత్రబృందం నయనతారకు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి ఆమెను రంగంలోకి దింపుతారా..లేక మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెడతారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…