నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ కంటే ముందు చాలామందికి తెలియని పేరు. ఇప్పుడు ఆ పేరు దేశంలో అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు ఇతడు. అందుకే అతడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. ఏం చేసినా.. అతడు ఎక్కడికి వెళ్లినా తెగ ఫాలో అవుతున్నారు చాలామంది. ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. చాలా మంది అతడిని ఇప్పటికీ గోల్డెన్ బాయ్ అని పిలుస్తున్నారట.
దీంతో అతడి బ్రాండ్ విలువ ప్రస్తుతం 1000 శాతం పెరిగింది. అంటే అతడు ప్రచారకర్తకు అంతక ముందు తీసుకునే విలువలో ఎక్కువ శాతం పెరిగిందన్న మాట.సోషల్ మీడియాలో నీరజ్ ఫాలోయింగ్పై ‘యూగోవ్ స్పోర్ట్స్’ అనే రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. సోషల్ , డిజిటల్ మీడియాలో అతడి రీచ్ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది. అతడి విలువ మరింత పెరగడానికి గల కారణం మరోటి ఉంది.
అదేంటంటే.. బంగారు పతకం గెలిచిన తర్వాత అతడి అభిమానులు పాక్ క్రీడాకారుడు అర్షాద్ నదీమ్పై విమర్శలు కురిపించారు. దీనికి నీరజ్ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది. అతడు బంగారు పతకం గెలవకముందు కూడా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.
అప్పట్లో తక్కువ తీసుకున్న ఈ బంగారు వీరుడు.. ప్రస్తుతం వాటి విలువలో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా అతడు సమాజానికి ఉపయోగపడే వాటికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తానని కూడా తెలిపాడు. పొగాకు, మద్యం ప్రకటలకు దూరంగా ఉంటానన్నాడు. అతడి కోసం దాదాపు 80 సంస్థలు క్యూ కట్టాయి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…