Connect with us

Featured

Niharika: పుల్లటి మామిడి పండ్లను తింటున్న నిహారిక… ఏదైనా విశేషం ఉందా అంటున్న నెటిజన్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా నిర్మాతగా కొనసాగుతున్నారు.అయితే నిహారిక వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇద్దరు దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించలేదు అలాగే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు.

ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఈ విషయం గురించి ఎక్కడ మనకు క్లారిటీ లేదు.అయితే నిహారిక మాత్రం ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా తిరిగి సినిమాలలో నటిస్తుందని కథనాలు కూడా వెలబడుతున్నాయి.

Niharika: మామిడి పండ్లు లేకుండా సమ్మర్ ఏంటి…

గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి నిహారిక ఈ మధ్య తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. దీంతో వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా ఈమె పుల్లటి మామిడి పండ్లను తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ మామిడి పండ్లు లేకుండా సమ్మర్ ఏంటి అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఏంటి నిహారిక ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Featured

Ntr: ఎన్టీఆర్ తో ఒకప్పుడు రొమాన్స్ .. ఇప్పుడు మాత్రం అక్కగా నటిస్తున్న హీరోయిన్.. ఎవరంటే?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ఎంతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారని హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

ఇకపోతే ఈ సినిమా కోసం ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఓ సెట్ కూడా వేయడానికి ప్లాన్ చేసాడు. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. బంగ్లాదేశ్ లో స్థిరపడి కష్టాలు పడుతున్న తెలుగు వాళ్ళ కోసం హీరో కష్టపడతాడు. ఆ నేపధ్యంలోనే సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.

అక్క పాత్రలో భూమిక..
ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ హీరోయిన్ భూమిక కోసం అద్భుతమైన పాత్ర సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే ఈమె ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అక్క పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో భూమికతో కలిసి సింహాద్రి సినిమాలో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం మాత్రం ఆమెకు తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ విషయాలన్నింటి గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: వ్యాధి వల్ల మతిమరుపు వచ్చింది.. సమంత సంచలన వ్యాఖ్యలు!

Published

on

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి కెరియర్ పై స్ఫూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు. ఈ వ్యాధి కారణంగా మరోసారి ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు.

Advertisement

ప్రస్తుతం ఈమె పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు దీంతో తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సమంత నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత తన వ్యాధి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మయోసైటిసీస్ వ్యాధి కారణంగా నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయాను. మతిమరుపు వచ్చినట్టు అయింది. ఆ సమయంలో నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, ఎవరు నా హెల్త్ గురించి అడగలేదని ఇప్పుడు అనుకుంటుంటాను.

అంతా మర్చిపోయాను..

Advertisement

ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయితే ఈ వ్యాధి వల్ల నేను సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికి నిర్మాతలు నేను తిరిగి వచ్చేవరకు నాకోసం ఎదురు చూస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ సమంత ఈ సందర్భంగా మయో సైటిసిస్ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Mahesh -Rajamouli: రెండు భాగాలుగా మహేష్ రాజమౌళి సినిమా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?

Published

on

Mahesh -Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని ఇటీవల కథా రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందనే విషయం తెలియడంతో ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి . ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా రానా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. కథ చాలా పెద్దది కావడంతో ఒకే భాగంలోనే ముగింపు చేయటం సాధ్యం కాదని అందుకే రెండు భాగాలుగా ఈ సినిమాని చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం.
రెండు భాగాలు..
ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇదే కనుక నిజమైతే మరో 10 సంవత్సరాలు పాటు మహేష్ బాబు వేరే సినిమాలలో కనిపించరు అంటూ అభిమానులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!