NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ పని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కి సంబంధించిన పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో లేడీ విలన్ గా మరొక బాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఈ సినిమాలో విలన్ గా ఐశ్వర్యరాయ్ ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద రికార్డుగా మిగిలిపోతుంది. ఓ టాలీవుడ్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ..విలన్ గా మారడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…