NTR Family: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఫోటోలు వైరల్!
NTR Family: ఎన్టీఆర్ కుటుంబం ఎక్కువగా మనకు బయట కనిపించరు. ఏదైనా కుటుంబ కార్యక్రమాలలో భాగంగా బయట కనిపించే ఎన్టీఆర్ ఫ్యామిలీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోని ఎన్టీఆర్ తల్లి, సతీమణి, పిల్లలు స్వామివారిని మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం చేరుకోవడంతో ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
స్వామివారి దర్శనం అనంతరం ఎన్టీఆర్ ఫ్యామిలీ మీడియా కంట పడటంతో క్షణాల్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండటం వల్ల స్వామివారి దర్శనానికి రాలేకపోయారని తెలుస్తుంది. ఇకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
సాధారణంగా ఎన్టీఆర్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో చాలా తక్కువగా షేర్ చేస్తారు. కాని వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే మాత్రం ఆ ఫోటో క్షణాలలో వైరల్ అవుతాయి. అయితే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సతీమణి పిల్లలు ఇలా మీడియా కంట పడటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా తమ అభిమాన నటుడి పిల్లలను చూడటంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఆయన నటించిన RRR ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…