NTR Family: ఎన్టీఆర్ కుటుంబం ఎక్కువగా మనకు బయట కనిపించరు. ఏదైనా కుటుంబ కార్యక్రమాలలో భాగంగా బయట కనిపించే ఎన్టీఆర్ ఫ్యామిలీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోని ఎన్టీఆర్ తల్లి, సతీమణి, పిల్లలు స్వామివారిని మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం చేరుకోవడంతో ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

స్వామివారి దర్శనం అనంతరం ఎన్టీఆర్ ఫ్యామిలీ మీడియా కంట పడటంతో క్షణాల్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండటం వల్ల స్వామివారి దర్శనానికి రాలేకపోయారని తెలుస్తుంది. ఇకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
సంతోషంలో తారక్ అభిమానులు….
సాధారణంగా ఎన్టీఆర్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో చాలా తక్కువగా షేర్ చేస్తారు. కాని వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే మాత్రం ఆ ఫోటో క్షణాలలో వైరల్ అవుతాయి. అయితే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సతీమణి పిల్లలు ఇలా మీడియా కంట పడటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా తమ అభిమాన నటుడి పిల్లలను చూడటంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఆయన నటించిన RRR ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


































