NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తుంది.ఇక డైరెక్టర్ ప్రశాంత్ జూన్ 4వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్ సెట్ లో ప్రశాంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. అదేవిధంగా రామ్ చరణ్ సైతం సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన ఫ్యామిలీ కోసం ఈయన ఒక డెలిషియస్ డిష్ పంపించి సర్ప్రైజ్ చేశారు.ప్రశాంత్ బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ నాటుకోడి పులుసు పంపించి వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సందర్భంగా లిఖితారెడ్డి నాటుకోడి పులుసుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలపరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ప్రశాంత్ ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…