NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తుంది.ఇక డైరెక్టర్ ప్రశాంత్ జూన్ 4వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్ సెట్ లో ప్రశాంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. అదేవిధంగా రామ్ చరణ్ సైతం సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన ఫ్యామిలీ కోసం ఈయన ఒక డెలిషియస్ డిష్ పంపించి సర్ప్రైజ్ చేశారు.ప్రశాంత్ బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ నాటుకోడి పులుసు పంపించి వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సందర్భంగా లిఖితారెడ్డి నాటుకోడి పులుసుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలపరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ప్రశాంత్ ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…