NTR: ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప2 . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన పుష్ప సినిమా అందరి అంచనాలు తారుమారు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పుష్ప 2 సెట్ లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామోజీ ఫిలింసిటీలో పుష్ప2 షూటింగ్ జరుగుతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ బ్రేక్ లో జూనియర్ ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ ని విజిట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ప్రస్తుతం పుష్ప 2 లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య పోటి ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇద్దరు మంచి స్నేహితులు.
ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ఆసక్తిగా ఉన్నాయి.
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎన్టీఆర్ విషెస్ చెబుతూ.. పార్టీ లేదా పుష్ప అని ఫన్నీగా కామెంట్ చేయడంతో వారి మధ్య ఉన్న బాండింగ్ కి ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇదే చనువుతో పుష్ప 2 సెట్ ని ఎన్టీఆర్ విజిట్ చేశాడు. దీంతో అటు బన్నీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…