NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది, ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిందంటే హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ గన్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని అశపడేలా..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతే కాకుండా ఆ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. దీంతో మన భారతీయ సినీ ప్రముఖులతో పాటు హాలీవుడ్ దర్శకులు సైతం వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్ బర్గ్ కూడా పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ, వాల్యూమ్ 3 డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా మన హీరోలపై గతంలో ప్రశంసలు కురిపించారు.
తాజాగా జేమ్స్ గన్ మరోసారి ఎన్టీఆర్ ను గుర్తు చేశారు.గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా జేమ్స్ గన్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యులో గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతే కాకుండా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు…‘గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?’.. అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జేమ్స్ గన్ స్పందిస్తూ.. వెంటనే తారక్ అని బదులిచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బోనులోంచి పులులతో పాటు బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…