గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరల్ని పెంచాయి. ఏకంగా రూ. 73.50 పెరిగింది. కానీ ఇంత పెరిగినా సామాన్యులకు మాత్రం ఊరట లభించింది. అదెలా అంటే.. ఆగస్ట్ 1న కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించిన కంపెనీలు.. కమర్షియల్ సిలిండర్ ధర కొనేవారికి వారికి మాత్రమే షాక్ ఇచ్చాయి.
కమర్షియల్ సిలిండర్ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వ్యాపారులకు షాక్ తగిలినట్టు అయింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. ఇప్పుడు రూ.73.50 పెరిగింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.157.50 పైనే పెరగడంతో వ్యాపారులపై భారీగా భారం పడనుంది.
ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.1800 కు పైగా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. సబ్సిడీ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. దీనికి పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.887 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు చెన్నైలో రూ.1,761, కోల్కతాలో రూ.1,623, ముంబైలో రూ.1,579.50 గా ఉంది. ప్రతీ నెల మొదటి తేదీన ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడమో.. తగ్గించమో చేస్తుంటాయి. అంటే ఉన్న ధరలను సవరిస్తుంటాయి. ఈ ధరలు అనేవి అతర్జాతీయ మర్కెట్ పై ఆధారపడి ఉంటాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…