ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులందరూ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూ విధించి వైరస్ కట్టడి కోసం తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఎంత కఠినమైన చర్యలు తీసుకోనైనా వైరస్ కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు.లాక్ డౌన్ అమలు విషయంలో అధికారులు తలలు పట్టుకోగా మరి కొందరు మాత్రం మంత్రాలతో కారోనాను తరిమి కొడతామని రంగంలోకి దిగారు.
తాజాగా, ఓ మంత్రగాడు కరోనాను తరమటానికి ఏకంగా కరోనా వార్డులో పూజలు నిర్వహించాడు. ‘ఓం కరోనా ఫట్, ఫట్, ఫట్.. స్వాహా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చదవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మంత్రగాడు మంత్రాలు చదవడం వల్ల కరోనా పారిపోవడం ఏమోగానీ ఆయన చదివే మంత్రాలు మాత్రం బాగా పాపులర్ అవుతున్నాయి.
కరోనా పారిపోవాలనే మంత్రగాడు చేస్తున్నటువంటి మంత్ర పూజలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోను బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ వరిందర్ చావ్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “గో కరోనా గో 2.0’ అనే శీర్షికను జత చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 42 షేర్ చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే విషయాలు తెలియడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…