ప్రస్తుతం అందరూ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి టీకాలు వేసుకుంటున్నారు. అయితే ఒక్క కరోనా టీకానే కాదు మిగిలిన అన్ని టీకాలు కూడా భుజానికే చేస్తారు. అసలు భుజనికే ఎందుకు చేస్తారు అనే డౌట్ చాలా మందికి వచ్చి వుంటుంది. అసలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
భుజం పై భాగంలో డెల్టాయిడ్ అనే కండరాలు ఉంటాయి. ఈ డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ కు సంబంధించిన ముఖ్యమైన కణాలు ఉంటాయి. మన శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు వాటియొక్క అవశేషాలను అంటే యాంటీజన్లను ఇవే ముందుగా గుర్తిస్తాయి. అటువంటి యాంటీజన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం జరుగుతుంది. తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుంది. ఈ యాంటీబాడీలు మన శరీరంలో ప్రవేశించిన వైరస్ తో పోరాడి ఆ వైరస్ ను అంతమొందిస్తాయి. ఇదండీ సంగతి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…