Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచారు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కామన్ మ్యాన్ కప్పు గెలవడం మొదటిసారి కావటం విశేషం. ఇలా ఈయన విజేత కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈసారి ఈ కార్యక్రమానికి గీతూ రాయల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పల్లవి ప్రశాంత్ ని ప్రశ్నిస్తూ అసలు బిగ్ బాస్ రావడం వెనుక కారణం ఏంటి అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చాలామంది తనను చీప్ గా చూశారని అందుకే తాను ఏంటో నిరూపించుకోవడం కోసమే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
తనకు వ్యవసాయ పనులు చేయడం ఆ పంటను హైదరాబాద్ కూకట్ పల్లి మార్కెట్ కు తరలించడం మాత్రమే తెలుసు. నాకు హైదరాబాదులో కూకట్ పల్లి మార్కెట్ తప్ప మరి ఏమి తెలియదని ఈయన తెలిపారు. అయితే ఒకసారి మా నాన్నను ఒక వ్యక్తి మీ అబ్బాయి ఏం చేస్తాడు అంటూ అడిగారు పొలం పనులు చేస్తాడని బాయికాడ పనులు చేసుకుంటారని చెప్పారు.
500 తో హైదరాబాద్ వచ్చాను…
పొలం పనులు చేస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి చాలా చీప్ గా చూసారు దాంతో నాకు చాలా బాధ కలిగిందని బాయికాడ పనులు చేసే వాళ్ళు ఏమీ సాధించలేరా అనే ఆలోచన నన్ను బిగ్ బాస్ వరకు తీసుకువచ్చిందని పల్లవి ప్రశాంత్ తెలిపారు. నేనేంటో నిరూపించుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నాన్న అంటూ 500 రూపాయలు చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చానని ఈ సందర్భంగా ఈయన తనని కొందరు చీప్ గా చూడటంతోనే తనని తాను ప్రూఫ్ చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చానని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…