Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ విన్నర్ గా ఒక సెలబ్రిటీగా బయటకు వచ్చారు. రైతుబిడ్డగా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు.
ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకు ఎంతో అండగా నిలబడ్డారనీ తెలియజేశారు.
తన స్నేహితులతో కలిసి తాను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను అని తెలిపారు. అయితే యూట్యూబ్ ఛానల్ కు చాలామంది సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత డబ్బులు రావడం కూడా మొదలయ్యాయి అయితే డబ్బు వచ్చే సమయంలో నా స్నేహితులు నన్ను ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తొలగించారని ప్రశాంత్ తెలిపారు. ఇలా వాళ్లు నన్ను తొలగించడంతో ఎంతో బాధపడ్డానని తెలియజేశారు.
స్నేహితులు మోసం చేశారు..
ఆ సమయంలో తాను పూర్తిగా డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు కూడా చేశానని కాకపోతే నా తల్లి తండ్రులు తనకు ఎంతో అండగా నిలబడటమే కాకుండా తనకి కూడా ఒక మొబైల్ ఫోన్ కొనివ్వడంతో తాను కూడా వీడియోలు చేయడం మొదలు పెట్టాను అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ సూసైడ్ ఆలోచనల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…