Pavan Kalyan : ఏపీ రాజకీయాలలో విమర్శల పర్వం తారాస్థాయికి చేరుకొని ఎకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడటం వంటివి చేసారు. ఇక ఇటు జనసేనాని వాటికి కౌంటర్లేస్తూ జగన్ మీద వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయనకు తెలుగు ఉచ్చారణ సరిగా రాదు, నేను పెట్టే వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా నేర్పిస్తాను అంటూ మాట్లాడారు. ఇలా ఇరు పక్షాలు ఒకరిమీద ఒకరు పంచులు వేసుకుంటుండగా తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి వాలెంటీర్ వ్యవస్థ గురించి కామెంట్స్ చేసారు.

ఏపీలో మహిళల అక్రమ రవాణా…
పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలను గుప్పిస్తూ తాజాగా ఏపీలో మహిళల అక్రమ రవాణా గురించి మాట్లాడారు. ఏపీలో దాదాపుగా 30వేల మంది మహిళలలు మిస్ అయ్యారని, అందులో 14 వేల మంది తిరిగి రాగా ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఏ విషయం తెలియదని, ఇది కేంద్ర నిఘా సంస్థ చెప్తున్న విషయాలు నేను కల్పించి చెబుతున్నవి కాదు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఏపీ లో ఇంతమంది మహిళలు, ఆడపిల్లలు కనిపించకుండా పోతుంటే జగన్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టాలి, ఏం జరుగుతోంది అనే విషయం తెలుసుకోవాలని అనుకోలేదా, డిజిపి ఏం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళల సమాచారం ఆలాగే ఆడపిల్లలకు ఏవైనా ప్రేమ వ్యవహారం ఉంటే ఆ విషయాలు అన్నీ తెలుసుకుని కొన్ని ముఠాలు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు. నీ ఇంట్లో ఆడపిల్ల కపించకుండా పోతే ఇలానే ఉంటావా సీఎం అంటూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.


































