Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో 150 రోజుల కూటమి పాలన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి పాలన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ 150 రోజుల కాలంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టడంతో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం అని తెలిపారు. ఇలాంటి అనుభవం కలిగిన వారు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆఫీసులో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు చేయించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రజల ముందుకు వచ్చి నేనున్నాను ఎవరు భయపడొద్దు అంటూ ప్రజలకు భరోసా కల్పించి బురదలో కూడా ఈయన పర్యటనలు చేశారు.
గత ప్రభుత్వ హయామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేపట్టలేదని అందుకే రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకుడు ఎంతో అవసరమని పవన్ తెలిపారు. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమాలను కనుక చూస్తే మరో 10 సంవత్సరాల పాటు మన బాబు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఇలా బాబు గురించి పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…