Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ జూన్ 16వ తేదీ కాకినాడ పిఠాపురంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఈయన యువతను ఉద్దేశిస్తూ పలు విషయాలు తెలియజేశారు.
ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… సినిమాలు వేరు రాజకీయం వేరు అంటూ ఈయన కామెంట్ చేశారు. యువత ఎప్పుడు కూడా సినిమాలపరంగా తమకు ఇష్టమైన హీరోని ఆరాధించవచ్చు వారి సినిమాలను చూడవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే వారి ఆలోచన ధోరణి మార్చుకోవాలని ఈయన సూచించారు.
తాను కూడా టాలీవుడ్ హీరోలంటే చాలా ఇష్టపడతానని తన తోటి హీరోల సినిమాలను తప్పకుండా చూస్తానని ఈయన తెలియజేశారు. చిరంజీవి రామ్ చరణ్ సినిమాలను ఇష్టపడతాను అలాగే తనకు ప్రభాస్ ఎన్టీఆర్ అన్న కూడా చాలా ఇష్టమైననీ వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా వారాహి యాత్రలో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడటమే కాకుండా వారి సినిమాలను కూడా చూస్తాను అంటూ ఈయన హీరోల పేర్లు ప్రస్తావిస్తూ చెప్పడంతో సదరు హీరో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…