Pawan-Roja war of words in AP politics..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటీవల మరోసారి వేడెక్కాయి. హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే వైసీపీ నేత రోజా ఇచ్చిన కౌంటర్ వివాదాస్పదంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఎగిసిపడుతున్నాయి.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు “పిచ్చి ముదిరింది” అంటూ విమర్శించారు. “ఎక్కడికెళ్లినా తాను అక్కడ పుట్టానంటాడు. అసలాయన ఎక్కడ పుట్టాడు? ఏం చదివాడు? ఆయనకే తెలియదు” అంటూ ఎద్దేవా చేశారు. రోజా వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందనను రేపాయి.
దీనికి కౌంటర్గా, విశాఖపట్నంలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ స్పందించారు. “నా పేరు పవనం. నేను తిరుగుతుంటాను. పవనాలు తిరుగుతుంటాయి. కానీ మీరు బావిలో ఉన్న కప్పలు” అంటూ కాస్త తూర్పు శైలిలో, అందరికీ అర్థమయ్యేలా, వైసీపీ నేతలపై చురకలేసారు.
ఈ కామెంట్లపై స్పందించిన రోజా కూడా, ట్విట్టర్ వేదికగా పవన్కు తిరుగుబాటు లాంటి స్పందననే ఇచ్చారు. “అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?” అనే ట్వీట్ ద్వారా ఆమెలో ఉన్న వ్యంగ్యాన్ని మరోసారి బయటపెట్టారు. ఇది కూడా ఇన్డైరెక్ట్గా పవన్ను ఉద్దేశించిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే రోజా చేసిన ఈ ట్వీట్పై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అపానవాయువు అంటే పిత్తు. పవన్ కళ్యాణ్ను అలాంటి పదాలతో పోల్చడం ఏం న్యాయం?” అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, ఇంత దారుణంగా దిగజారి మాట్లాడడం దారుణమని ఫైర్ అవుతున్నారు.
ఈ వివాదంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, రోజా చేసిన ట్వీట్కి కామెంట్స్ చేసేందుకు వీలుండకుండా ఆమె కామెంట్స్ సెక్షన్ను డిసేబుల్ చేయడం. ఇది ఆమె విమర్శలకు తగిన స్పందనలను ఎదుర్కొనకుండా తప్పించుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు.
సినిమా ప్రొమోషన్ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ వేదికపై పెద్ద దుమారంగా మారింది. ఇది ఇకపై ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…