యూపీ లో ఉజ్వల 2.0 పథకం ప్రారంభం!

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉజ్వల 2.0 పథకాన్ని వీడియో ద్వారా ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

. ఈ సంధర్భంగా యోగి మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్‌లో, ఉజ్జ్వాలా పథకం మొదటి దశలో కనీసం 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కోవిడ్ సమయంలో, ప్రధాని మోదీ లబ్ధిదారులందరికీ ఆరు నెలల పాటు ఉచిత సిలిండర్లను అందించామని పేర్కొన్నారు. 2016 లో ప్రారంభించిన ఉజ్వల 1.0 సమయంలో, దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు LPG కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగి స్పష్టం చేశారు.