ఈరోజు తెలంగాణలో పాలిసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఇక ఈ పరీక్ష రాయడం కోసం ఒక లక్ష 2 వేల 496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపధ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 10 గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తారు. ఇక 11 గంటల దాటినా తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్ లోనికి అనుమతించే ప్రశక్తి లేదని స్పష్టం చేసారు అధికారులు.

ఇక ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలలో వచ్చే ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ జరుగుతాయి.





























