Poonam Kaur : 2005 లో మిస్ ఆంధ్ర టైటిల్ గులుచుకున్న పూనమ్ కౌర్, ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాలలో కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే అనుకున్నది అనుకున్నట్టు తన అభిప్రాయాన్ని చెప్తుంటుంది పూనమ్.

ఆడవాళ్లను కేవలం పిల్లలని కనే మెషిన్ లాగా చూడకూడదు…
తాజాగా గురువారం నాడు, అబార్షన్ విషయంలో సుప్రీమ్ కోర్ట్ ఒక మహిళ తన 14 నుంచి 20 వారాల లోపు ఉన్న ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని ప్రకటించింది. ఒకవేళ పెళ్లి అయినా కాకపోయినా స్త్రీకి అబార్షన్ చేయించుకునే పూర్తి హక్కు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ విషయం పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది పూనమ్. దీనిపై పూనమ్ సానుకూలంగా స్పందించింది.

ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలకు ఇష్టం లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని, వారికి ఇష్టం లేకుండానే గర్భవతులు కూడా అవుతున్నారని చెప్పుకొచ్చింది. “ఎంతోమంది అమ్మాయిలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇష్టం లేకుండానే గర్భవతులయ్యి ఆర్థికంగా సెక్యూరిటీ కోసం భర్తతో కలసి ఉండే వాళ్ళని చాలామందిని నేను చూశాను. మగవాళ్ళు ఆడవాళ్లని కేవలం పిల్లలని కనే ఒక మెషిన్ లాగా చూడకూడదు” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.



























