Prathyusha Garimella : ఫ్యాషన్ ప్రపంచంలో డిప్రెషన్, ఒంటరితనం ఎంతోమంది సెలబ్రిటీలను ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరలేని చాలా మంది యువత పిరికితనంతో చావును ఆశ్రయిస్తున్నారు. శనివారం రాత్రి ఇలాంటి ఒక దుర్ఘటనే జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ గా ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ హీరో హీరోయిన్లకు బట్టలు డిజైన్ చేసిన ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకి పాల్పడింది.

తల్లిదండ్రులకు భారం కాకూడదని….
శనివారం రాత్రి బోటిక్ నుండి ఇంటికి వచ్చిన ప్రత్యూష, బాత్ రూమ్ లో విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటల సమయంలో వాచ్ మాన్ భార్య దుర్గ ఏమైనా కావాలా అని అడుగగా ఏమైనా కావాలంటే పిలుస్తాను.. అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తలుపులు వేసుకున్న ప్రత్యూష రాత్రి మళ్ళీ 9 గంటల సమయంలో తలుపులు కొట్టినా తీయలేదని, లైట్లు కూడా వేసుకోలేదని తలుపు కొట్టమని దుర్గ చెప్పింది. ఇక ఉదయం 6 గంటల సమయంలో మరోసారి తలుపు కొట్టినా ఎటువంటి స్పందన రాలేదు.

ఇక ప్రత్యూష తండ్రి తో కలిసి దుర్గ భర్త తలుపులు తెరిచి చూస్తే బాత్ రూంలో విగత జీవిగా కనిపించిందని దుర్గ తెలిపారు. అధిక మోతాదు లో కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు ఇంట్లో సుసైడ్ నోట్ ను గుర్తించారు. అందులో తల్లిదండ్రులకు భారం కాకూడదనే, ఒంటరితనం భరించలేక చనిపోతున్నట్లు క్షమించమని తల్లిదండ్రులను రాసింది. ప్రస్తుతం ప్రత్యూష మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటెజ్ కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తరువాత అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.



























