Prbhudeva: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయిన ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టారు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభుదేవా మొదట కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత దర్శకుడిగా నటుడిగా కూడా తన సత్తా నిరూపించుకున్నాడు.
ఇలా కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకి దూసుకుపోతున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవాకి మొదట రమాలత్ అనే ఆమెతో వివాహం జరిగింది . వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు విశాల్ 13 ఏళ్ల వయస్సులో ప్రాణాంతక వ్యాధితో మరణించారు. ఆ తరువాత హీరోయిన్ నయనతార ని ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళాడు.
నయనతారతో పెళ్లికి మొదటి భార్య రమా వ్యతిరేకించింది. ఆ తరువాత 2011లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. నయనతార, ప్రభుదేవా పెళ్ళి జరుగుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వారి పెళ్ళి రద్దయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభుదేవా రెండో భార్య తెరమీదకు వచ్చింది.
మొదటి భార్యకి విడాకులు ఇవ్వటం, నయనతారతో పెళ్లి రద్దవటంతో ప్రభుదేవా మానసిక క్షోభకు గురయ్యాడు.
ఆ సమయంలో ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానిని వద్ద చికిత్స తీసుకుంటున్న క్రమంలో డాక్టర్ తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారని రూమర్లు వచ్చాయి. అయితే తమ మధ్య సంబంధాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. అయితే తాజాగా ప్రభుదేవా 50వ పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా అతడికి విషెస్ చేస్తూ ఆమె తొలిసారిగా మీడియా ముందు కనిపించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ‘మీతో మూడేళ్ల ప్రయాణం.. అద్భుతమైన జర్నీ. మీరు ఎంతో జాయ్ ఫుల్ పర్సన్.నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…