Maa Neela Tank: తెలుగు సినీ ప్రేక్షకులకు ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గుబాటి రానా కాంబినేషన్ లో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ప్రియా ఆనంద్ ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా నటించిన 180 సినిమా, అలాగే హీరో శర్వానంద్ నటించిన కో అంటే కోటి ఇలాంటి సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఈమె నటనకు అందం అభినయం తోడవడంతో అవకాశాలు వరుసగా వచ్చి పడ్డాయి. అలా మొదటి తెలుగులో నటించిన ఈమె తమిళంలో వరుస అవకాశాలు రావడంతో అక్కడే దాదాపుగా పదేళ్లపాటు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. కాగా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో అయ్యే ముందు మా అందరికీ తెలిసిందే.
తమిళంలో అవకాశాలు రావడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అనే అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అలాగే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మొత్తానికి ప్రియా ఆనంద్ తెలుగులో మా నీళ్ల ట్యాంక్ అనే ఒక వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా ఆనంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందట.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రియా ఆనంద్..
సీరియస్ లో ప్రియా ఆనంద్ ఒక పల్లెటూరి అమ్మాయిగా చాలా నేచురల్ లుక్ లో కనిపించబోతోంది. అంతేకాకుండా అందులో ఆమె వస్త్రధారణ అన్నీ కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా కనిపిస్తుంది. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ నటించిన ఈ వెబ్ సిరీస్ జులై 15 నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు ఇమేజెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ప్రియా ఆనంద్ అచ్చం పల్లెటూరి అమ్మాయి లాగా తన లుక్స్ తో అదరగొడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…