Movie News

Producer Mallidi Sathyanarayana Reddy : ఆది సినిమాకు హీరోగా ఆకాష్ ను అనుకున్నారు.. కానీ మధ్యలో ఎన్టీఆర్ ఎలా వచ్చాడు అంటే : నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి

Producer Mallidi Sathyanarayana Reddy : డిస్ట్రిబ్యూషన్ నుండి నిర్మాతగా ఢీ, బన్నీ, భగీరథ వంటి సినిమాలను నిర్మించిన సత్యనారాయణ రెడ్డి గారు కొడుకును డైరెక్టర్ గా లాంచ్ చేయాలనీ బాగా కష్టపడ్డారు. ఇక అది కుదరక హీరో చేయాలనుకున్నా చివరికి డైరెక్టర్ గా బింబిసార లాంటి మంచి సినిమా తీసి హిట్ కొట్టాడు వశిష్ఠ. ప్రస్తుతం చిరంజీవి గారితో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ఇంటర్వ్యూ లలో సత్యనారాయణ రెడ్డి గారు ఆయన సినిమా జీవితం గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఆది సినిమా మొదట అనుకున్నది ఆకాష్ కోసం….

కొన్నిసార్లు అదృష్టం ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. అలానే దురదృష్టం ఇంకొంత మందిని ఎలా పిలుస్తుందో కూడా చెప్పలేం. ఇక్కడ ఎన్టీఆర్, హీరో ఆకాష్ ల విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చి పెట్టి మాస్ ఆడియన్స్ థియేటర్లో సీట్లు చింపి విజిల్స్ పడిన మొదటి సినిమా ఆది అని చెప్పొచ్చు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని ఎన్టీఆర్ తొడగోడితే నందమూరి అభిమానులు పండగ చేసుకున్నారు.

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా మొదట హీరోగా అనుకున్నది ఎన్టీఆర్ ను కాదనే విషయం తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు తెలిపారు. డైరెక్టర్ వి వి వినాయక్ తో మంచి సన్నిహిత్యం ఉన్న ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ లో ప్రయత్నాలు చేస్తున్న వినాయక్ కు బెల్లంకొండ గారు అవకాశం ఇవ్వడం ఆయన ఆకాష్ హీరోగా సినిమా చేయాలనీ అనుకుంటే అది అనేక మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ హీరోగా ఆది సినిమా అయిందట. అలా ఆకాష్ తెలియకుండానే మంచి అవకాశం కోల్పోగా ఎన్టీఆర్ కు అదృష్టం వరించిందని చెప్పారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago