Producer Natti Kumar : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీ లో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా, ఎవరికి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు.

అప్పుడే వాటాలు ఇచ్చేసారు… వారి ఆస్తులు వారివే…
కృష్ణ గారు, విజయనిర్మల గారు సినిమాలలో నటించినపుడు సంపాదించిన ఆస్తులు ఇప్పుడు కోట్లయ్యాయని అయితే వాటిని వారికి నచ్చిన వారికే ఇచ్చారు అంటూ మాట్లాడటం అపోహ అవుతుందంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ ఫ్యామిలీతో 1986 నుండి మంచి సంబంధాలు ఉన్నాయని ఆ చొరవ తోనే విషయాలు చెప్పగలుగుతున్నానని, కృష్ణ గారి ఆస్తులు సెపరేట్ గా విజయనిర్మల గారి ఆస్తులు సెపరేట్ గా ఉన్నాయి.

అయితే కృష్ణ గారు విజయ నిర్మల గారి గొప్పతనం వారికి స్వార్థం లేకపోవడం అంటూ చెప్పారు. వారు ఆస్తులు కూడబెట్టినా వాళ్ల కుటుంబం సభ్యులకు సమానంగా పంచారంటూ చెప్పారు. కృష్ణగారు తమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లకు ఆయన సంపాదించిన ఆస్థిలో సమానంగా వాటా ఇచ్చారు. అలాగే విజయ నిర్మలగారు కూడా ఆమె సంపాదించిన ఆస్థిలో తన తమ్ముళ్లకు ఇచ్చి అలాగే కొడుకు మనవడికి ఇచ్చారు. వాళ్ళు బ్రతికి ఉన్నపుడే ఆస్తి సమాన వాటాలుగా పంచారు. ఇక నిర్మల గారు కృష్ణ పిల్లలకు కూడా ఆస్తి ఇచ్చినట్లు చెబుతారు కానీ అది నాకు తెలియదు. అయితే కృష్ణ గారు నరేష్ కి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు తన తల్లే వందలకొట్ల ఆస్తి ఇచ్చి వెళ్లారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ వట్టివి అని చెప్పారు.




























