Producer Natti Kumar : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపి ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. దీనిపై తాజాగా అనేక చర్చలు నడుస్తున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కి చెందినవారు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రుల ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలను సత్కరించారు. అయితే ఈ వేడుక మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ అసహనం వ్యక్తం చేసారు.

ఏపీ ప్రభుత్వాన్ని అవమానించారు…
నట్టి కుమార్ ఆస్కార్ సన్మాన వేడుక గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం నుండి ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని ని కానీ, ఆలిని కానీ రోజాను కానీ పిలిచారా?? ఎవరినీ పిలవకుండా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఆహ్వానం లేకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి డబ్బు తీసుకుని చేశారు. ఇక ఏపీ నుండి వెళ్లిన మంత్రిని కూడా పెద్దగా పట్టించుకోలేదని, ఆయన మాట్లాడిన దానిమీద కూడా వివరణ అడుగుతామంటూ నట్టి చెప్పారు.

ఇక తెలంగాణ మంత్రి తలసాని మాట్లాడిన విషయాల మీద కూడా నట్టి ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తరువాత సినిమా ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది అంటూ మాట్లాడారు. నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ, మమ్మల్ని కెసిఆర్, కేటిఆర్ దగ్గరికి తీసుకువెళితే మీరు చిన్న సినిమాలను పట్టించుకోని విషయం లెక్కలతో సహా వివరిస్తాం అంటూ ఫైర్ అయ్యారు. ఈ వేడుకకు ఉపయోగించిన 25 లక్షలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెత్తిన వేస్తే ఒప్పుకోము అంటూ చెప్పారు.


































