Producer Pokuri Babu rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం, దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూటి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.

రాజశేఖర్ హీరోగా పనికి రాడు అనుకున్నా…
విప్లవ కథలను సినిమాలుగా తెరకెక్కించిన పోకూరి బాబు రావు గారు టీ. కృష్ణ గారి డైరెక్షన్ లో సినిమాలను నిర్మించారు. అన్న, మా ఆయన బంగారం, ప్రజాస్వామ్యం వంటి సూపర్ హిట్స్ రాజశేఖర్ పోకూరి బాబు రావు కాంబినేషన్ లో వచ్చాయి. అయితే మొదట అన్న సినిమాకు బాలకృష్ణ ను హీరోగా అనుకున్నారట.

అయితే ఆయనను సంప్రదించలేదట, అదే సమయంలో రాజశేఖర్ ను హీరోగా తీసుకుందామని అనుకుంటే పోకూరి బాబు రావు గారే అతను హీరో ఏమిటి ఏం వద్దు అని ఇతరులతో చెప్పాడట. అలాంటిది ఆయన సినిమాలోనే హీరోగా సినిమా నిర్మించాడు. అది కూడా వరుస హిట్ సినిమాలను రాజశేఖర్ తో చేయడం విశేషం.

































