పునీత్ మరణంపై తొలిసారి స్పందించిన భార్య.. ఏం చెప్పారంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేడు,రాడు మరణ వార్త విని ఇప్పటికి 12 మంది అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో పునీత్ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక మరణం తర్వాత మొదటిసారిగా తన భార్య అశ్విని స్పందించింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిసింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ మరణం తన కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది.పునీత్ ఇక లేడు అన్న విషయం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తెలిపింది. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అంటూ ఆమె తెలిపింది.

అలాగే పునీత్ మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడిన మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు అని తెలిపింది అశ్విని. అశ్విని తో పాటు హీరో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర లు కూడా అభిమానులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

అదేవిధంగా అంత్యక్రియల దృశ్యాలను పదే పదే ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పునీత్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ ని కడసారిగా చూసుకునేందుకు కంఠీరవ స్టూడియో కి లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు సైతం అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.