Puri Jagannath : లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ చాలా విషయాల గురించి చర్చించారు. ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఇక చాలా రోజుల నుండి ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ఏదో ఉంది అని అందుకే పూరి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసాడు అని. ఇక దీనికి బలాన్ని చేకూరుస్తూ ఇటీవల పూరి తన కొడుకు హీరో గా వచ్చిన సినిమా ఈవెంట్ కు రాకపోవడంతో ఈ అనుమానం మరింత బలపడింది.

మ మధ్య ఉన్నది స్నేహమే.. అఫైర్ కాదు…
పూరి జగన్నాథ్ ఛార్మి మధ్య ఎఫైర్ ఉంది అందుకే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు అనే మాటలు వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడారు. ఒక క్లారిటీ ఇచ్చారు వారి రిలేషన్ గురించి. ఛార్మి పదమూడేళ్ల వయసుకే ఇండస్ట్రీ కి వచ్చింది. అప్పటి నుండి తనతో నా ప్రయాణం సాగుతోంది. ఎప్పటి నుండో ఛార్మి తో పరిచయం స్నేహం ఉన్నాయి. మా మధ్య ఉండేది ఎఫైర్ అయితే అది ఎంతో కాలం నిలబడదు, ఆకర్షణ ఎక్కువ కాలం ఉండదు.

మాది స్నేహం ఎవరు ఏమనుకున్నా మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. ఛార్మి కి పెళ్ళై ఉన్నా, లేక ఛార్మి కి ఒక యాభై ఏళ్ళు ఉండి ఉన్నా ఇలాంటి వార్తలు మా గురించి వచ్చేవి కాదు అంటూ పూరి మాది స్నేహం అంటూ క్లారిటీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ అనే కంపెనీ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. జ్యోతిలక్ష్మి సినిమా సమయం నుండే ఛార్మి నిర్మాత గా మారి సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం అందుకుంది.

































