Puri Jagannath : ఆకాష్ పూరీ హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ బాగా వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ తన కొడుకు సినిమా ఈవెంట్ కు రాలేనంత బిజీ ఏంటి అంటూ వ్యాంపులు, రాంపులు మామూలే వస్తుంటారు, పోతుంటారు కానీ భార్య పిల్లలను వదులుకోరాదు, పిల్లలకోసమే మనం బతికేది అంటూ లెక్చర్ ఇచ్చాడు. ఎంతోమంది స్టార్లను చేసిన నువ్వు కొడుకు కోసం రాలేనంత బిజీనా అంటూ మాట్లాడాడు బండ్ల గణేష్. ఇక స్టార్ హీరోలను కూడా ఆకాష్ కోసం రాలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఈ విషయం పై పరోక్షంగా పూరీ స్పందించాడు.

ఒకరి గురించి మాట్లాడేటపుడు జాగ్రత్త ఉండాలి…
ఇక పూరీ పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్ కు కౌంటర్ ఇచ్చాడు. మౌనంగా ఉండటం గొప్ప వరం, ఎదుటి వారు మాట్లాడేటపుడు ఎక్కువగా విని తక్కువ మాట్లాడటం వళ్ళ చాలా సాధిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఒకరి గురించి వాగే ముందు ఏం మాటాడుతున్నామో తెలుసుకుని ఎలాంటి మాటలు మాటాడుతున్నామో గుర్తుంచుకుని మాట్లాడాలి.

ఏం ఆలోచించకుండా ఇంకొకరి జీవితం, కెరీర్ నాశనం చేయకూడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ఆలోచనలు అభిమానులతో పంచుకునే పూరీ తాజాగా ఈ మాటలను పోస్ట్ చేయడంతో అందరూ ఇది బండ్ల గణేష్ కు కౌంటర్ అనుకుంటున్నారు.



























